తెలంగాణ
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం అత్యవసర ల్యాండింగ్

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ముంబాయి నుండి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే గమనించిన పైలెట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు మళ్లించి ల్యాండింగ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. విమానం దిగి బయటకు వచ్చిన వారంతా ఊపిరిపీల్చుకున్నారు.