ఆంధ్ర ప్రదేశ్
Nellore: దారుణం.. భార్యను గోంతు కోసి చంపిన భర్త

Nellore: అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. అనుపల్లిపాడుకు చెందిన పచ్చిపాల బాబు, పద్మావతి భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు భార్యపై అనుమానం పెంచుకుని కొన్ని రోజులుగా వేధించసాగాడు.
గత రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి భార్య గొంతు కోసి చంపేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న వెంకటాచలం సిఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.