ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు పోటెత్తిన వరద

విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తింది. అధికారులు 70 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 4లక్షల 50 వేల 240 క్యూసెకుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.



