తెలంగాణ

ఎక్కువ మంది పిల్లల్ని కనండి .. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Rakesh Reddy: ఆర్మూర్ MLA రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు కుటుంబ నియంత్రణ పాటించొద్దని పిలుపునిచ్చారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలన్నారు రాకేష్ రెడ్డి. ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువుల సంఖ్య పెరగాలన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రతగా ఉంటుందన్నారు ఆయన. దేశం, ధర్మం లేకుంటే భవిష్యత్తు ఉండదన్నారు రాకేష్ రెడ్డి. పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనే రాకేష్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button