ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారికి కొప్పెర వంశస్తులు హుండీ విరాళం..

కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారికి కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుపతి సమీపంలోని కొప్పెరవాండ్లపల్లెకు చెందిన కొప్పెర సాయిసురేష్ ఈ హుండీని ఆలయ అధికారులకు అందించారు. రాగి, ఇత్తడితో కలిపి తయారుచేసిన ఈ హుండీ 70 కిలోల బరువు ఉంటుందని దీని విలువ 2.50 లక్షలు అని దాతలు తెలిపారు. 1821 నుంచి వంశపారంపర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు సమర్పిస్తున్నామని దాతలు వెల్లడించారు.



