ఆంధ్ర ప్రదేశ్

AP News: గో బ్యాక్ జగన్.. అమరావతి ద్రోహి జగన్ అంటూ ఫ్లెక్సీలు

AP News: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హైటెన్షన్ నెలకొంది. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యత్నించారు. దీంతో మున్సిపల్ సిబ్బందిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లిలో ఉద్రిక్తతపరిస్థితులు చోటుచేసుకున్నాయి.

జగన్ పర్యటన నేపథ్యంలో రెంటపాళ్ల చుట్టుపక్కల 25 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరోవైపు నందిగామ అడ్డరోడ్డు దగ్గర గో బ్యాక్ జగన్, అమరావతి ద్రోహి జగన్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. దీంతో ఆ ఫ్లెక్సీలను తొలగించారు పోలీసులు. కాసేపట్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చేరుకోనున్న వైఎస్ జగన్ రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button