ఆంధ్ర ప్రదేశ్
Peddireddy: మాజీమంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

Peddireddy: వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి సమీపంలో 14 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు పోలీసులతో కలిసి పెద్దిరెడ్డి వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు, పోలీసులను స్థానికులు అడ్డుకున్నట్లు తెలుస్తుంది.