ఆంధ్ర ప్రదేశ్
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు.. శ్రీహరికోటలో హైఅలర్ట్

శ్రీహరికోటలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఇస్రో భద్రతా వలయంలోకి వెళ్లింది. భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. శ్రీహరికోటలోకి వచ్చిపోయే వాహనాలతోపాటు గగనతలంలో కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రధానంగా 11 ముఖ్యమైన కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం కొనసాగుతోంది. శ్రీహరి కోటతోపాటు బెంగళూరు, తిరువనంతపురం అహ్మదాబాద్ తదితర కేంద్రాల్లో భద్రత పెంపును పెంచారు.