ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలోని రేణిగుంటలో హైఅలర్ట్

తిరుపతిలోని రేణిగుంటలో హైఅలర్ట్ కొనసాగుతోంది. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్ పోర్టులో క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా రెస్టారెంట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు హెవీ రష్ ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో ముమ్మర సోదాలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ 2.0లో భాగంగా ఎలాంటి నష్టం జరగకుండా మరింత నిఘా పెంచారు తిరుపతి పోలీసులు.