జాతియం
కేరళలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా తొమ్మిది జిల్లాల్లోని విద్యా సంస్థలకుసెలవు ప్రకటించారు. కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలప్పురంలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొట్టాయంలో జూన్ 17 వరకు మైనింగ్ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి.
కేరళలోని చాలా జిల్లాల్లో నైరుతి రుతుపవనాల వర్షపాతం కొనసాగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ముందు జాగ్రత్త చర్యగా కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, త్రిస్సూర్, ఎర్నాకుళం, ఇడుక్కి మరియు కొట్టాయంలలోని విద్యా సంస్థలకుసెలవు ప్రకటించారు.