తెలంగాణ
Kaleshwaram: భారీ వర్షాలు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు

Kaleshwaram: మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉరకలేస్తున్నాయి. కాళేశ్వరంలో ఉభయ నదులు పుష్కర ఘాట్ల మెట్లను తాకుతూ 9.820 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది.
దిగువ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద పొటెత్తుతుంది. వరదనీరు చేరి 5.25 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో తరలిరాగా మొత్తం 85 గేట్లు ఎత్తి అదేస్థాయిలో వరద నీటిని ఔట్ ఫ్లోను దిగువకు ఇంజనీరింగ్ అధికారులు విడుదల చేస్తున్నారు.