తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలో పలు చోట్ల 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. రాష్ట్రంలో మొత్తం 11 జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది.
తెలంగాణలో భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. మరో రెండు రోజుల పాటు వడగాల్పులు ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణలో గత నాలుగైదు ఐదు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన పెరుగుదల నమోదవుతోంది. ప్రస్తుతం పలు ప్రాం తాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరింది.