ఆంధ్ర ప్రదేశ్
క్యాన్సర్పై అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్

అవగాహాన లోపంతోనే అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రకాశంజిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో క్యాన్సర్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి హాజరయ్యారు మంత్రి సత్యకుమార్.
ఈ సందర్బంగా క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించి చికిత్స అందిచాలనే ప్రభుత్వం రాష్ట్రమంతటా స్క్రీనింగ్ టెస్టులు చేస్తుందన్నారు. ప్రభుత్వం దీని కోసం 650 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తెలిపారు.