తెలంగాణ
Harish Rao: తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు పేగుబంధం

Harish Rao: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఎల్లుండి బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి నుంచి యువకుల పాదయాత్ర చేపట్టారు. వరంగల్ సభకు పాదయాత్రగా బయల్దేరారు. ఈ పాదయాత్రను మాజీమంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు పేగుబంధం ఉందన్నారు మాజీమంత్రి హరీష్ రావు.
ఈ పాదయాత్ర బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి విజయయాత్రగా కాబోతుందన్నారు ఆయన. చాలా పార్టీలు పుడుతుంటాయి.. పోతుంటాయి.. కానీ, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడిందని గుర్తుచేశారు. కేసీఆర్ అనే గొంతు కోట్ల గొంతుకలను ఏకం చేసిందన్నారు. సీఎం రేవంత్ అరాచకాలను ఎదిరించడానికి గులాబీదండు కదిలిందన్నారు హరీష్ రావు.