తెలంగాణ
Harish Rao: ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన

Harish Rao: తెలంగాణ సర్కార్పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వేలకు పైగా ఉన్న హోం గార్డులకు.. 12 రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి ఏ సమాధానం చెబుతారన్నారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన అని మండిపడ్డారు. హోంగార్డులకు వేతనాలు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీశ్ రావు.