Harish Rao: ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ప్రజా పాలన అంటివి.. సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బర్ అంటివి.. ప్రతి రోజు ప్రజలు కలుస్తా అంటివి.. కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చేటేస్తివి అంటూ విమర్శించారు. అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన కొనసాగుతుందన్నారు హరీష్ రావు.
ఇక పోలీసు పహారా మధ్య గ్రామ సభలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా, దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్కు, కమాండ్ కంట్రోల్ సెంటర్కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నవు ఎందుకు అని హరీష్ రావు ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి అధికార నివాసం రేవంత్ దర్పానికి సరిపోదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్రావు విమర్శించారు. మంత్రులు, అధికారులను ప్యాలెస్కు పిలిపించుకొని, అహంభావం ప్రదర్శిస్తున్నవని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు.