Harish Rao: హైదరాబాద్ను గుండా రాజ్యంగా మార్చారు

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై హైదరాబాద్ను గుండా రాజ్యంగా మార్చారని మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు .పెట్టుబడి దారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెడ్కార్పేట్తో స్వాగతం పలికిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందని ధ్వజమెత్తారు. పెట్టుబడిదారుల వద్ద అక్రమ వసూళ్లు చేసి పంచుకోవడంలో తేడాలొచ్చి తన్నుకు చస్తున్నారని విమర్శించారు.
తాము అగ్రికల్చర్ పెంచితే, వాళ్లు గన్ కల్చర్ను పెంచుతున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఉన్న తేడా అదేనని అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు దర్శించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయల పండితులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.



