తెలంగాణ
Harish Rao: కొణతం దిలీప్, మున్నెక్రిశాంక్ను 9 గంటల పాటు విచారించడం దారుణం

Harish Rao: మరోసారి కాంగ్రెస్ పై ట్విట్టర్ ద్వారా బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైరయ్యారు. కొణతం దిలీప్, మున్నె క్రిశాంక్ ను 9 గంటల పాటు విచారించడం ప్రజాపాలన అంటారా అని హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు మద్దతు ఇచ్చినందుకు హెచ్సీయూ విద్యార్ధుల ఇండ్లలో రాత్రి సమయంలో సోదాలు చేయడం పద్ధతి కాదన్నారు.
హెచ్సీయూ విద్యార్ధుల ఫోన్ల కోసం వారి ఇళ్లలో రాత్రి సోదాలు చేయడం కరెక్ట్ కాదన్నారు హరీష్ రావు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడం అధికారంలో ఉన్న తెలంగాణలో అదే విలువలను ఖూనీ చేయడం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు.