తెలంగాణ

Harish Rao: ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. కోతల రేవంత్ రెడ్డి

Harish Rao: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో నాలుగు మండలాలకు రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్నా. మహాధర్నా కార్యక్రమానికి హజరైన మాజీ మంత్రి సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీశ్ రావు.

హరీశ్ రావు కామెంట్స్

👉 ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు,కోతల రేవంత్ రెడ్డి.. ఏం పథకానికైనా కోత పెడుతున్నాడు

👉 రేవంత్ రెడ్డి పటాన్ చెరుపై పగబట్టడంలో అర్థం లేదు

👉 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తామంటూ.. పటాన్ చెరు, మేడ్చల్ వారికి ఇవ్వకపోవడం దారుణం

👉 రెండులక్షలమంది పైగా రైతులను అన్యాయం చేస్తూ.. అర్హులైన వారికి పించన్లకోత, అన్ని పధకాలలో కోతలు పెట్టి ఎగవేత చేసిన రేవంత్ రెడ్డిని విడిచేది లేదు

👉 టీఆర్ఎస్ హాయంలో 24 గంటల నాణ్యమైన విధ్యుత్ ఇచ్చాం.. రేవంత్ రెడ్డి హాయాంలో విధ్యుత్ కోతలు తప్పడం లేదు

👉 రైతు భందు ఎగవేత దారుణం, రైతులకు బాకీ బడ్డ పైసలు ఇవ్వకపోతే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో వాతలుపెడతారు

👉 రైతులకు బుణమాఫీ విషయంలో తీవ్ర అన్యాయం చేశారు

👉రైతు భీమా కూడా రేవంత్ రెడ్డి బంధ్ పెట్టాడు

👉 మార్పు తెస్తానన్న ముఖ్యమంత్రి అన్నీ పథకాలు ఎగవేసి ఏం మార్పులు తెచ్చారో చెప్పాలి

👉 దేవుని మీద ఒట్టుబెట్టి దోకా చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

👉 కేసీఆర్ చేసిన మంచిపనులను బంద్ చేయటం తప్ప రేవంత్ రెడ్డి చేసేందేమి లేదు

👉 దేశానికి అన్నం పెట్టే బనకచర్ల రైతులను జైల్లో పెట్టి వారి భూములను గుంజుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే.

👉 కేసీఆర్ హాయాంలో ఆకాన్నంటిన భూముల ధరలు, రేవంత్ పాలనలో డమాల్ అయ్యాయి

👉రైతుబందు రాని రెండు లక్షల మంది రింగురోడ్డు ఎక్కి ఉద్యమిస్తే రేవంత్ రెడ్డి గుండెలు అదరాలి

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువును తీస్తున్నాడు, బనకచర్ల ఏడుందో తెలియని ముఖ్యమంత్రి పాలనలో ఉండటం సిగ్గుచేటు

👉 రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఆగమాగం చేస్తున్నాడు,సైకోలా ప్రవర్తిస్తున్నాడు

👉 రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపించినందుకు ఓర్వలేక కౌశిక్ రెడ్డిని రాత్రికి రాత్రి అక్రమ కేసుల్లో ఇరికించారు

👉కేసీఆర్, కేటీఆర్ లపై కేసులు, పెట్టి ఇబ్బందులు పెట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసేందేమీ లేదు

👉అందాలపోటీలు పెట్టి అసభ్యకరంగా ప్రవర్తించి రాష్ట్ర పరువు తీశారు

👉కేసీఆర్ ప్రస్తావన లేని రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండదు,

👉కేసీఆర్ రైతుల కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేస్తే వాటిలో డీజెల్ పోసి నడిపించాలన్న సోయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

👉రైతులకు న్యాయం జరిగేంత వరకు బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button