తెలంగాణ
Harish Rao: ప్రజా పాలన కాదు.. పీడించే పాలన

Harish Rao: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతు నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రేవంత్ రెడ్డి పర్యటన జరిగిన ప్రతిసారీ ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు.. పీడించే పాలన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ తన ఆవేదనను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందన్నారు హరీష్ రావు.
మొన్న నాగర్కర్నూల్ పర్యటనలో చెంచు సోదరులను కూడా అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను, రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు.