తెలంగాణ
Harish Rao: రైతు భరోసా రూ.15 వేలు అని.. రూ.12 వేలకు కుదిస్తారా?

Harish Rao: సీఎం రేవంత్ పాలనపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. రైతు భరోసా పేరుతో ఏటా ఎకరానికి 15వేల రూపాయలు ఇస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతులను దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు.
సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ రైతుల ఆశలను అడియాశలు చేసిందన్నారు. రైతు భరోసా పథకాన్ని రైతు గుండె కోతగా మార్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు. మోసానికి పర్యాయపదం రేవంత్ రెడ్డి అనే విషయం నగ్నంగా బయటపడిందని ట్వీట్ చేశారు.