ఆంధ్ర ప్రదేశ్

నేడు GVMC డిప్యూటీ మేయర్ ఎన్నిక

నేడు GVMC డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడింది. దీంతో ఇవాళ సభ్యులు హాజరయ్యేలా కూటమి నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికపై టెన్షన్ నెలకొంది. కాగా ఇప్పటికే విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవింద్‌ని ప్రకటించారు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరును ఖరారు చేశారు. ఇందులో భాగంగా సీల్డ్ కవర్‌లో గోవింద్ పేరును పంపింది జనసేన అధిష్టానం.

దీంతో పార్టీ మారిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. ఇక ఏప్రిల్ 26న అవిశ్వాస తీర్మానంతో డిప్యూటీ మేయర్ పదవి కోల్పోయాడు వైసీపీ నేత జియ్యని శ్రీధర్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button