రేపు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం

ఇక రేపు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమాశేం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా అవిశ్వాసం నెగ్గేలా కూటమి వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు అవిశ్వాసం వీగిపోయేలా వైసీపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే కౌన్సిల్కి హాజరుకావొద్దని 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది వైసీపీ. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని పేర్కొంది. ప్రత్యేక సమావేశానికి ఎట్టి పరిస్థితుల్లో హాజరుకాకూదని నిర్ణయించింది.
విప్ జారీ తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీప్రియాంక. మాజీమంత్రి అవంతి కూతురే లక్ష్మీప్రియాంక. ఇన్నాళ్లు కౌన్సిల్ వైసీపీ చీఫ్గా ఉన్న లక్ష్మీ ప్రియాంక కూటమికి మద్దతిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు జీవీఎంసీ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సభ్యులను తప్ప బయటివారిని లోపలి కి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. మరోవైపు విదేశాల్లో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు వరుసగా విశాఖకు చేరుకుంటున్నారు. ఓటింగ్ ప్రక్రియను వీడియోగ్రఫీ చేసేం దుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 64కు చేరింది కూటమి సభ్యుల బలం. 30కి చేరింది వైసీపీ కార్పొరేటర్లు సంఖ్య.