తెలంగాణ
Khammam: గ్రామ సభలో రచ్చ.. అనర్హులను జాబితాలో చేర్చారని ఆగ్రహం

Khammam: ఖమ్మం జిల్లా గండగలపాడు గ్రామసభ రచ్చ రచ్చ అయ్యింది. పథకాల జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు అధికారులను నిలదీశారు. అనర్హులను జాబితాలో చేర్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు హాజరైన మున్సిపల్ కమిషనర్పై ప్రజలు మండిపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.