జాతియం

FASTag Annual Pass: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

FASTag Annual Pass: ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్‌ పాస్‌ అందుబాటులోకి రానుంది. 3వేల రూపాయలు చెల్లించి ఈ పాస్‌ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. యాక్టివేట్‌ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్‌ కమర్షియల్‌ వాహనాలకు ఇది వర్తిస్తుందని గడ్కరీ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఇది పనిచేస్తుందని నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీని యాక్టివేషన్‌ కోసం త్వరలోనే ఓ లింక్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాజ్‌మార్గ్‌ యాప్‌తో పాటు NHAI, MoRTH వెబ్‌సైట్లలో ఈ లింక్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.

వార్షిక పాస్‌ తీసుకురావాలన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ పాస్‌ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. టోల్‌ప్లాజాల వద్ద రద్దీని, వివాదాలు తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button