తెలంగాణ
కడెం ప్రాజెక్టులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గల్లంతు

ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడెం ప్రాజెక్టులో పడి గల్లంతయ్యారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పైకి ఫోటో దిగడానికి వచ్చిన కరీంనగర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర్ రెడ్డి ప్రమాదవశాత్తూ ప్రాజెక్టులో పడిపోయాడు.
ఖానాపూర్కు పెళ్లి కోసం వచ్చి మార్గమధ్యలో ఉన్న ప్రాజెక్టుపై ఫోటోలు దిగే ప్రయత్నంలో ప్రాజెక్టులో పడి గల్లంతయ్యారు. అంధ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర్ రెడ్డి కరీంనగర్ జిల్లా జూలపల్లి సాయికాబి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో SGT గా విధులు నిర్వహిస్తున్నాడు.



