వ్యాపారం

Gold Rate Today: బంగారం కొనడం కష్టమే.. భారీగా పెరిగిన పసిడి ధర.. లక్ష కు అడుగు దూరంలో..

Gold Rate Today: వన్‌ ల్యాక్‌ రూపీస్‌. అవును అక్షరాల లక్ష రూపాయలు. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే లక్ష నగదుని మీ దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే పసిడి ధర టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. రేపు కూడా ఈ గోల్డ్‌ ధరల షైనింగ్‌ పెరగబోతోంది..? అంటూ మళ్లీ అలర్ట్ వచ్చేసింది. అనుకున్నట్లుగానే బంగారం ధర లక్ష మార్కుకు చేరుకుంది. మార్కె ట్‌లో గోల్డ్‌ రేట్ రన్‌ కొనసాగుతోంది.

ఇవాళ కూడా బంగారం ధర భారీగా పెరిగింది. దాదాపు 950రూపాయల మేర పెరిగింది. హైదరాబాద్‌లో 24క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర 99వేల 950రూపాయలకి చేరింది. దాదాపు 15రోజుల్లోనే 7వేల 130మేర ధర పెరిగింది. ఈ వారంలోనూ బంగారం ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 30న అక్షయ తృతీయకు లక్ష దాటొచ్చని అంచనా వేస్తున్నారు.

బంగారం ఎడాపెడా పెరగడానికి ఒకే ఒక్క బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఒకవైపు సుంకాలతో బాదేస్తున్న ట్రంప్‌, మరోవైపు తమదేశంలోని సెంట్రల్‌బ్యాంక్‌ను కూడా టెన్షన్‌ పెడుతున్నారు. ట్రంప్‌ తీరుతో గోల్డ్‌పై పెట్టుబడికే ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్గెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్‌‌లో 24క్యారెట్ల బంగారం ధర 99వేల 590గా ఉంది. 22క్యారెట్ల ధర 97510గా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button