తెలంగాణ
Sajjanar: అమ్మాయిలూ..సోషల్ మీడియాలో బూచోళ్లతో జాగ్రత్త

Sajjanar: టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. సజ్జనార్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సైబర్ మోసాలు నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే స్నేహం ముసుగులో సోషల్ మీడియాలో బూచాళ్లున్నారు జాగ్రత్త అని ట్వీట్ చేశారు.
అంతేగాక సోషల్ మీడియా వేదికల్లో గుడ్డిగా అజ్ఞాత వ్యక్తులను ఫాలో కాకండి అని, ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించకండి అని సూచనలు చేశారు. ఇక ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను, ఫోటోలు , వీడియోలను అసలే షేర్ చేయకండి అని తెలిపారు. స్నేహం, ప్రేమ ముసుగులో కామాంధులు, నేరస్థులు ఉండొచ్చు.. బీ కేర్ ఫుల్ అని ఎక్స్ వేదికగా అవగాహన కల్పించారు.