తెలంగాణ
హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై అత్యాచారం

Hyderabad: రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మందమల్లమ్మ వద్ద జర్మనీ యువతిపై రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారంకు పాల్పడ్డారు. సెలవుల కోసం హైదరాబాద్ వచ్చిన జర్మనీ యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి మీర్ పేట్ మందమల్లమ్మ ఫంక్షన్ కు వెళ్లింది.
అయితే షాపింగ్ కోసం కారులో వెళ్లిన జర్మనీ యువతిని వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి బలవంతంగా లాక్కెల్లి అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంను పరిశీలించి సమీప ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు ఎవరనేదానిపై పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు.