తెలంగాణ

GBS Case: హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు

GBS Case: హైదరాబాద్‌లో మరో వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసు నమోదైంది. సిద్దిపేటకి చెందిన మహిళకు GBS ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో వంద వరకు ఈ కేసులు నమోదు కాగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.

కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్‌ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు.. ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ, పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇది.

ఈ వైరస్ బారినపడిన వారికి కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, కడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, జీబీఎస్‌ అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం చేయొచ్చని వైద్యులు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button