తెలంగాణ

ఐడీఎల్ కంపెనీలో పేలుడు .. ఒకరు అక్కడికక్కడే మృతి.. మరోకరికి గాయాలు

హైదరాబాద్ కూకట్​పల్లిలోని ఐడీఎల్ గ్యాస్​కట్టర్​ సిలిండర్​పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్పాట్​లోనే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూపీకి చెందిన ఎండీ మోబిన్​, జమీల్​అహ్మద్​ జీడిమెట్ల పరిధిలోని సుభాశ్​నగర్​లో నివసిస్తున్నారు. వీరు ఎర్రగడ్డలోని జీషాన్​ట్రేడర్స్​స్క్రాప్ కాంట్రాక్టర్​ ఇంతియాజ్​వద్ద లేబర్​గా పని చేస్తున్నారు.

కూకట్​పల్లిలోని ఐడీఎల్​ కంపెనీలో ఉన్న ఐరన్​ స్క్రాప్​ను తీసుకువెళ్లడం కోసం గ్యాస్​ కట్టర్​తో కట్​ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు గ్యాస్​కట్టర్ ​సిలిండర్​పేలడంతో మోబిన్ ​స్పాట్​లో మృతి చెందాడు. తీవ్ర గాయాలతో జమీల్​ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కూకట్​పల్లి పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button