తెలంగాణ
Gangula: కేసీఆర్కు నోటీసులిచ్చి రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నాడు

Gangula: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులివ్వడంపై బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ స్పందించారు. రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని వారు ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టు భావిస్తున్నామన్నారు.
కేసీఆర్కు నోటీసులిచ్చి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో 3 పీయర్లు కుంగిపోయినందుకు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందన్నారు గంగుల. పాతబస్తీ గుల్జారు హౌస్లో 17 మంది చనిపోతే సీఎం పరామర్శించలేదని గంగుల ఆరోపించారు.