ఆంధ్ర ప్రదేశ్
Gangamma Jatra: తిరుపతి తాతయ్యగుంటలో ముగిసిన గంగమ్మ జాతర

Gangamma Jatra: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. ఏడు రోజులపాటు వివిధ వేషాలలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. ఇవాళ తెల్లవారుజామున గంగమ్మ విశ్వరూప దర్శనం ప్రతిమను ఏర్పాటు చేసి, కైకాల కులస్తులు పేరంటాల వేషం వేసుకొని అమ్మవారి చంప నరకడంతో జాతర ప్రక్రియ ముగిసింది.
చివరి ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి ప్రతిష్టించిన విశ్వరూప దర్శనం మట్టిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. మట్టిని తీసుకెళ్లి పూజ గదిలో పెట్టుకుంటే మంచి శుభ పరిణామమని భక్తుల నమ్మకం. భక్తుల తాకిడిని కట్టుదిట్టం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.