తెలంగాణ
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

గద్వాల్ అభివృద్ధికి మద్ధతుగా ఉన్నానన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చలకు దారి తీశాయి. నడిగడ్డలోని ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పలు కీలక అభివృద్ధి పనులు ఆగిపోయాయని సీఎం దృష్టికి తీసుకువచ్చినా స్పందన లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్లో చేరలేదు కానీ అభివృద్ధి కోసం మద్దతిస్తున్నాన్న ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. మరోవైపు రానున్న ఎన్నికల్లో తన క్యాడర్కు ఏ పార్టీ నుంచి టికెట్ ఇప్పిస్తారు..? ఎలా గెలిపిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. కానీ అవకాశం వచ్చినప్పుడు తానే మార్గం చూపిస్తానన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది.