Srisailam: జూలై 1 నుంచి శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం

Srisailam: శ్రీశైలంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి శ్రీమల్లికార్జునస్వామి ‘ఉచిత స్పర్శ దర్శనాన్ని’ పునఃప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం ఒంటిగంట 45నిమిషాల నుంచి 3గంటల 34నిమిషాల వరకు ఉచితంగా స్పర్శ దర్శనాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కంప్యూటరైజ్డ్ టోకెట్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు.
ప్రస్తుతానికి దేవస్థానం వద్ద టోకెన్లు జారీ చేస్తామని, తర్వాత ఆన్లైన్లో నమోదుచేసుకునే విధానం ప్రవేశపెడతామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. టోకెన్లలో భక్తుల పేరు, ఆధార్, ఫోన్ నంబర్, క్యూఆర్ కోడ్ ఉంటాయని చెప్పారు.
అవకాశాన్ని బట్టి రోజూ వేయి నుంచి 1,200 మందికి ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని భావిస్తున్నామన్నారు. మహాశివరాత్రి బ్రహ్మో త్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తిక మాసాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ దర్శనం ఉండదని తెలిపారు.