జాతియం

పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు

Charanjit Singh Channi: సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2016 లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ జరిగి ఉంటే ఆధారాలు కనిపించాలి కదా అని ఆయన ప్రశ్నించారు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం ఆధారాలు చూపించలేదని విమర్శించారు.

తాను మొదటి నుంచీ దీనిపై ఆధారాలు అడుగుతున్నానని, అయితే ప్రస్తుతం బాధితుల గాయాలు మానపడటమే ముఖ్యమని, దోషులను గుర్తించి శిక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చరణ్ జిత్ సింగ్ చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ మరోసారి సైన్యాన్ని, వైమానిక దళాన్ని కించపరుస్తోందని బీజేపీ విమర్శించింది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని పాకిస్తానే అంగీకరించినా, కాంగ్రెస్ మాత్రం సైన్యం అబద్ధం చెబుతోందని ఆరోపిస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతలకు అనుమానం ఉంటే పాకిస్థాన్ వెళ్లి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సరికాదని బీజేపీ నేతలు అన్నారు. . కాంగ్రెస్ పాక్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తోందని, సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది

మరో వైపు చన్నీ తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. తాను సర్జికల్ స్ట్రైక్స్‌పై ఎలాంటి ఆధారాలు అడగలేదని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని, పాకిస్థాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు, దేశానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నామని, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button