అంతర్జాతీయం

అలనాటి అందాల నటి రోజా అరెస్ట్..?

Roja: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. నేటి సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలే టార్గెట్ గా చర్యలకు పాల్పడుతుంది. విచ్చలవిడిగా బూతులతో రెచ్చిపోయిన నాయకుల భరతం పట్టే పనిలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, జోగి రమేశ్‌ తనయుడిని వివిధ కేసుల్లో అరెస్ట్‌ చేశారు. ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా టార్గెట్ అయ్యారా? ఆడుదాం ఆంధ్రలో భారీ అవినీతి నిజంగానే జరిగిందా? లేదంటే వేధింపులు చేయడానికి ఏసీబీ కేసులు నమోదు చేసిందా..?

ఒకప్పుడు అందాల నటి ఎందరో అభిమానుల్ని అక్కున చేర్చుకున్న నటి. తన అంద చందాలతో సినిమా తెరపై ఒక వెలుగు వెలిగిన నటి. మూడు దశాబ్దాల నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు రాజకీయంగా ఎంతో స్థాయికి ఎదిగిన నటి. ఆమె ఎవరో కాదు మాజీ మంత్రి రోజా. త్వరలో అరెస్టు కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ఏపీలో ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ లో చేరి దాని తర్వాత కొన్ని కీలక పదవులు పార్టీ పరంగా అనుభవించిన తర్వాత తల్లి లాంటి పార్టీని పక్కనపెట్టి వైసీపీ పార్టీలో చేరి నగిరి నియోజకవర్గంలో 2019లో ప్రజల ఆశీస్సులతో గెలిచారు.

కానీ దాని తర్వాత ఐదేళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీని ప్రధానంగా తెలుగుదేశాన్ని జనసేన పార్టీ నేతలు కాదు పార్టీ అధినేతలను ఎక్కడపడితే అక్కడ భారీ విమర్శలు చేశారు వ్యక్తిగత హననం చేశారని చెప్పుకోవచ్చు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును అనరాని మాటలు మాట్లాడారు సభ్య సమాజం తలదించుకునే మాటలు కూడా మాట్లాడిన పరిస్థితి కనీసం తాను మహిళ అని కూడా చూసుకోకుండా విమర్శలు చేశారు. రాజకీయంగా మాట్లాడడం వేరు. రాజకీయ ఎదుగుదల కోసం మాట్లాడటం వేరు.

కానీ వ్యక్తిగత దూషణ లు కనీసం సభ్య సమాజం తలదించుకునే మాట్లాడారు. ఇవే ఇప్పుడు ఆమె మెడకు చుట్టు కుంటున్నాయి గత ఐదేళ్ల కాలంలో మంత్రిగా పనిచేసిన సమయంలో ఎన్నో రకాల అవినీతి అక్రమాలు చేశారని కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టారని ఆరోపణలు ఉన్నాయి వాటన్నిటికీ బలం చేకూర్చే విధంగా తాజాగా ఏపీ ప్రభుత్వం ఆమె నిర్వహించిన శాఖ పైన దృష్టి పెట్టి జరిగిన అవినీతినంత బయటకు తీస్తుంది అయితే ఆ అవినీతి అంతా త్వరలోనే చర్యలు ఉంటాయని చెబుతున్నారు అయితే సహజంగా తెలుగుదేశం పార్టీ అధినేత‌, సీయం చంద్రబాబు మహిళల జోలికి వెళ్ళడు.

కానీ రోజా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది ఒకవేళ అరెస్టు చేసిన కొన్ని కేసుల్లో ఇరికించిన వేధింపులు గురిచేసిన ఎక్కడా కూడా ప్రజా గ్రహం ఉండదనే అభిప్రాయం కూడా పార్టీ పెద్దల్లో ఉంది. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు సభ్య సమాజం తలదించుకునే మాటలు రోజా గత ఐదేళ్ల కాలంలో అంతకు ముందు కూడా మాట్లాడిన పరిస్థితులు నిజంగా రాజకీయంగా ఎదగాలంటే అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు రాజకీయ విమర్శలు మాత్రమే చేయించ్చు.

కానీ మూడు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయంలో చక్రం తిప్పినటువంటి పార్టీ ల అధినేతలను నోటికి వచ్చినట్టు మాట్లాడడం కుటుంబాలను దూషించడం కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలను వ్యక్తిగతనం టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఆమె పైన ఏ రకమైనటువంటి ఆరోపణలతో అరెస్టు చేసిన నిజంగానే అవినీతి జరిగి ఉంటే ఆధారాలతో అరెస్టు చేసిన కక్ష సాదింపులో భాగంగా అరెస్టులు చేసిన ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరనే వాదనలు ఉన్నాయి.

రోజాపై ఇప్పటికే విచారణ ఆలస్యమైందని భావించిన కూటమి ప్రభుత్వం ఆమె నిర్వహించిన క్రీడా శాఖ లో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఎటకేలకు ఏసిబి విచారణకు ఆదేశించింది.. ఆడదాం ఆంధ్ర పేరిట నాసిరకపు క్రీడా సామాగ్రి కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి.. గత ప్రభుత్వ హయాంలో కేవలం ఆడదాం ఆంధ్ర పేరిట నిర్వహించిన కార్యక్రమానికి 45 రోజుల్లో 119 కోట్లు ఖర్చు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ..క్రీడ మంత్రిత్వ శాఖకు ఇచ్చిన నిధులను భారీగా దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేస్తూ విచారణకు ఏసీబీ ని ప్రభుత్వం ఆదేశించింది గత ప్రభుత్వం లో ఆడుదాం ఆంధ్రపైన అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టిడిపి జనసేన తీవ్ర విమర్శలు గుప్పించాయి.

సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు చేశారు. ఇక క్రీడా శాఖతో పాటు రోజా నిర్వహించిన పర్యాటక శాఖలో అవకతవకలు కూడా కూటమి జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పర్యాటక శాఖ నిర్మించిన నూతన భవనాలు ఖర్చుపైన కూడా విచారణ జరిగినట్లు తెలుస్థుంది. ఋషికొండ పర్యాటక భవనాల పై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తో పాటు కూటమి నేతలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఎందుకు నిర్మించారో ప్రకటించకుండా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారన్న విమర్శలు వచ్చాయి.

దీని ద్వారా దాదాపు 500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది అన్నది అధికార కూటమి ప్రధాన విమర్శ అక్కడ నిర్మించిన భవనాలు కూడా పర్యాటక శాఖ ఆద్వర్యంలో నిర్మించినవే అవ్వడం, దానిపైన కూడా విచారణ జరగాలనే డిమాండ్ ఉంది. మొత్తం మీద రోజా ఆడుదాం ఆంధ్ర పై ఏసీబీ విచారణ ఏ విధంగా ఎదుర్కొంటారన్నది పొలిటికల్గా హాట్ టాపిక్ గా మారింది.

అరెస్టుల భయంతోనే రోజా ఇల్లు వదిలి బయట వెళ్లిపోయారని కనీసం నగరిలో కావచ్చు చెన్నైలో కావచ్చు ఎక్కడ పక్క రాష్ట్రాల్లో కూడా కనిపించకుండా పోయారనే చర్చ కూడా నడుస్తుంది నిత్యం ఇతర దేశాలు ఇతర ప్రాంతాలను తిరుగుతున్నారని టాక్ నడుస్తుంది. అందువల్లనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి వైసిపి ఆవిర్భావ సభల్లో కూడా ఇంకేమీ పార్టీ కార్యక్రమాల్లో కూడా రోజా పాల్గొనడం లేదు.

సో చూద్దాం త్వరలో ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ చదరంగంలో మాజీ మంత్రి రోజాను అరెస్టు చేస్తారా అరెస్టు చేస్తే ఏ కేసుల్లో అరెస్ట్ చేస్తారు నిజంగానే ఆడుదాం ఆంద్రా అనేటటువంటి కార్యక్రమంలో జరిగినటువంటి అవినీతిపైన అరెస్ట్ చేస్తారా లేదంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఋషికొండ ప్యాలెస్ భవనాల నిర్మాణాలు కావచ్చు లేదంటే పర్యాటక శాఖలో జరిగినటువంటి రకరకాల అవినీతి అక్రమాలు కావచ్చు వాటిల్లో మరికొన్ని కేసులు పెట్టి అరెస్టు చేస్తారా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button