జాతియం
యూపీలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

Road accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును.. బొలెరో వాహనం ఢీ కొట్టింది. మీర్జాపూర్-ప్రయాగ్రాజ్ హైవేపై ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో 19 మందికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతులు ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు. ప్రయాగ్రాజ్ లో కుంభమేళాకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.