తెలంగాణ
Sircilla: సిరిసిల్లలో రోడ్డెక్కిన రైతన్నలు

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో వడ్ల కొనుగోలు చేయడం లేదని సిరిసిల్ల-సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. సన్న వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు.
నెల రోజులుగా వడ్లను కొననుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.