జాతియం
ఆలయ హుండీలో రూ.కోట్ల విలువైన ఆస్తి పత్రం

కోట్ల రూపాయలు విలువైన ఆస్తిపత్రాల్ని ఓ వ్యక్తి ఆలయ హుండీలో వేశాడు. కుటుంబ కలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పడవేడులోని శ్రీ రేణుగాంబాళ్ అమ్మన్ ఆలయ హుండీలో ఆస్తి పత్రాలను మాజీ సైనికుడు విజయన్ వేసినట్లు గుర్తించారు.
అయితే అవి ఇప్పుడు తిరిగివ్వాలని అతడి భార్య, కుమార్తెలు కోరుతున్నారు. ఇక ఈ అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడుతామంటోంది ఆలయ సిబ్బంది. తమిళనాడులోని పడవేడులో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.