జాతియం

రాహుల్‌కు ఎన్నికల సంఘం సవాల్

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓటర్ల జాబితా అక్రమాల ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. రాహుల్ విశ్లేషణను అర్థం పర్థం లేనిదిగా అభివర్ణించిన ఈసీ, ఆయన తన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, లేనిపక్షంలో దేశానికి క్షమాపణ చెప్పాలని శుక్రవారం సవాల్ విసిరింది.

ఇండియా’ కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ, 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీగా ఓట్ల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ సర్వేలో ఒకే ఓటరు పేరు పలుమార్లు నమోదు కావడం, ఇతర రాష్ట్రాల ఓటర్ల జాబితాలోనూ అదే వ్యక్తి పేరు ఉండటం, ఉనికిలో లేని చిరునామాలు, ఒకే ఇంటి నంబర్‌పై వందలాది ఓట్లు, ఫొటోలు సరిగా లేని గుర్తింపు కార్డులు, కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫారం-6 దుర్వినియోగం వంటి అనేక అవకతవకలను గుర్తించినట్లు ఆయన వివరించారు.అంతేకాకుండా, అధికార బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించిందని, డిజిటల్ ఓటర్ల జాబితాను తమకు ఇవ్వడానికి నిరాకరించిందని రాహుల్ ఆరోపించారు.

ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ తన విశ్లేషణను, ఈసీపై చేసిన ఆరోపణలను నిజమని నమ్మితే, ప్రమాణ పత్రంపై సంతకం చేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఒకవేళ ఆయన సంతకం చేయకపోతే, ఆయన తన విశ్లేషణను నమ్మడం లేదని స్పష్టమవుతుంది. ఆ పక్షంలో ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలి. ఆయన ముందు ఈ రెండే మార్గాలున్నాయని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఈ వ్యవహారంపై బీజేపీ కూడా స్పందించింది. రాహుల్ గాంధీ తన ఆరోపణలకు సంబంధించిన అనర్హుల జాబితాను ఎందుకు సమర్పించడం లేదని బీజేపీ మీడియా సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ప్రశ్నించారు. “ఆయన ఆధారాలు సమర్పించడంలో విఫలమైతే, ఇదంతా కేవలం రాజకీయ నాటకమని స్పష్టమవుతుందపి బీజేపీ విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button