సినిమా

ఈ నగరానికి ఏమైంది 2 సంచలన అప్డేట్‌!

Ee Nagaraniki Emaindhi 2: 2018లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్‌తో మళ్లీ రాబోతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకోనుంది.

‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా యూత్‌లో సంచలనం సృష్టించి, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటమ్, వెంకటేష్ కకుమాను నటనతో అలరించిన ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తనదైన స్టైల్‌లో ‘ఈ నగరానికి ఏమైంది 2’ని తెరకెక్కిస్తున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలోనే సీక్వెల్ ప్రకటించిన తరుణ్, ఇప్పుడు అఫీషియల్ పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. ‘టీమ్ కన్యా రాశి’ వస్తోందంటూ జూన్ 28, 29న కీలక వివరాలు వెల్లడించనున్నారు. ఈ గ్యాంగ్ మళ్లీ ఏ సందడి చేయనుందో తెలియాలంటే, వేచి చూడాల్సిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button