తెలంగాణ
హైదరాబాద్ జలమండలి ముందు ఎంపీ ఈటల రాజేందర్ ధర్నా

హైదరాబాద్ జలమండలి ముందు ఎంపీ ఈటల రాజేందర్ ధర్నాకు దిగారు. GHMC బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఈటల ఆందోళన చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ సమస్యలతో ప్రజల కుస్తీ అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు.
భూగర్భ డ్రైనేజీ పనులు, SNDP పనులు పూర్తి వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం వచ్చిన పనులు పూర్తి కాలేదని ఈటల ఆరోపించారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లకు తాగునీటి సరఫరా అందించాలన్నారు.