తెలంగాణ

Eatala Rajendar: ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసింది

Eatala Rajendar: ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు ఎంపీ ఈటల రాజేందర్. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు, 66 మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నా ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 317 జీవో కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ అని గుర్తుచేశారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రూ.12 లక్షల వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించిందని గుర్తుచేశారు. గతంలో కన్నా భిన్నంగా నేషనల్ హైవేస్ , ఎయిర్ పోర్టులు ఉన్నాయన్నారు ఈటల.

హైడ్రా పేరుతో అమాయకులను రోడ్డుపాలు చేసిన పాపం కాంగ్రెస్‌దేన్నారు ఈటల. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే 1లక్షా50వేల కోట్ల నిధులు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఈటల చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా కేంద్రంపై నిందలు వేయడానికి చూస్తోందని మండిపడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button