తెలంగాణ
మద్యం మత్తులో నడి రోడ్డుపై బైక్ కు నిప్పు

తరచూ ట్రబుల్ ఇస్తుందని ఒక వ్యక్తి బైక్ కు నిప్పంటించాడు. జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై రాజారాం వద్ద టిఆర్ నగర్ కు చెందిన సలీం అనే వ్యక్తి పల్సర్ బైక్ కు నిప్పు పెట్టాడు. దీంతో వేగంగా మంటలు అంటుకొని బండి కాలిపోయింది.మద్యం మత్తులో ఉన్న సలీం అంతటితో ఆగకుండా కాలుతున్న బైక్ పై పెద్ద పెద్ద బండ రాళ్లు వేసాడు.
వెంటనే సమాచారం అందుకున్న జగిత్యాల ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో బైక్ పై నుండి మంటలు ఎటు వ్యాపించలేదు.