తెలంగాణ
మద్యం మత్తులో అంబులెన్స్ నడిపి.. పోలీసులకు పట్టుబడ్డ డ్రైవర్

మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్ పట్టుబడిన ఘటన హైదరాబాద్లోని ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సాయిగణేష్ అంబులెన్స్ డ్రైవర్ రమేష్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పోలీసులకు చిక్కాడు. అనుమానం వచ్చిన పోలీసులు టెస్ట్ చేయగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ రమేష్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన 16మంది మందుబాబులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.