Donald Trump: చైనాకు ట్రంప్ మరో వార్నింగ్.. 24 గంటల డెడ్ లైన్

Donald Trump: 24 గంటలే టైమ్.. లేదంటే మోత మోగిపోద్ది ఇదీ చైనాకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హుకుం. అమెరికాపై బీజింగ్ 34 శాతం సుంకాన్ని ప్రకటించిన 48 గంటల్లోపే డొనాల్డ్ ట్రంప్ చైనాపై అదనంగా 50 శాతం సుంకాన్ని ప్రకటించాడు. ఈ సుంకాన్ని ట్రంప్ రెండు రోజుల క్రితం, ఇరుదేశాలు ఒకదానిపై ఒకటి వార్నింగ్ ఇచ్చుకున్న నేపథ్యంలో జరిగింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో ఇప్పుడు అన్ని చైనా వస్తువులపై అమెరికా సుంకం 84 శాతానికి చేరుకుంది.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు వర్తిస్తుందని వైట్ హౌస్ చెప్పిన 10 శాతం ప్రపంచ సుంకానికి మించి ఉండటం విశేషం. ట్రంప్ సుంకాలలో చైనా సంఖ్యను 94 శాతానికి తీసుకువెళుతుంది. అధ్యక్షుడు ట్రంప్ చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, అమెరికాపై విధించిన అదనపు సుంకాన్ని వెనక్కి తీసుకోవడానికి లేదా ఉపసంహరించుకోవడానికి 24 గంటల అవకాశాన్ని ఇచ్చినప్పటికీ, అలా చేయకపోతే, చైనా వస్తువులు మొత్తం ఈ సవరించిన 94 శాతం సుంకాన్ని ఎదుర్కోవాల్సిందే.
చైనా ఎక్కువ చేస్తోందని, టారిఫ్స్ విషయంలో మొండిపట్టుదలకు పోతే దెబ్బతింటుందని ట్రంప్ హెచ్చరించాడు. చైనా ఇప్పటికే రికార్డు స్థాయిలో విధించిన సుంకాలతో 34 శాతం ప్రతీకార సుంకాలు విధించడం దారుణమన్నాడు. తాను హెచ్చరిస్తున్నప్పటికీ.. అమెరికాపై అదనపు సుంకాలను జారీ చేయడం అన్యాయమని ట్రంప్ అన్నాడు. అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే ఏ దేశం అయినా, మొదట్లో నిర్ణయించిన వాటి కంటే ఎక్కువ సుంకాలను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశాడు.
అమెరికా విషంయోల చైనా విధించిన 34 శాతాన్ని విత్ డ్రా చేసుకోకుంటే ఏప్రిల్ 8 అంటే ఇవాళ తర్వాత, ఏప్రిల్ 9 అంటే రేపట్నుంచి 50 శాతం అదనపు సుంకాలను విధిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా సుంకాల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చైనాతో చర్చించాలంటే ముందు టారిఫ్స్ తగ్గించాలని తేల్చి చెప్పాడు.
అమెరికాపై సుంకాలు విధించే దేశాలపై పరస్పర సుంకాలు విధించాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు, చమురు ధరలు గత 72 గంటలుగా దెబ్బతింటూ వస్తున్నాయ్. దశాబ్దాలుగా అమెరికాపై స్థూల సుంకాల దుర్వినియోగమంటూ అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెబుతున్నా అమెరికాపై, చైనా సుంకాలు 34 శాతంతో రచ్చ మొదలైంది. ట్రంప్ టారిఫ్స్కు, చైనా రివర్స్ అటాక్ చేయడంతో వాణిజ్యం యుద్ధం రసకందాయంలో పడింది. ట్రంప్ ప్రకటనకు ముందు, పరస్పర సుంకాలు బాధాకరమైన వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయని, ఇది ఎవరికీ ప్రయోజనం కలిగించదని చైనా ఇప్పటికే హెచ్చరించింది.