తెలంగాణ
సూర్యాపేట జిల్లా DMHO కోటాచలం సస్పెన్షన్

సూర్యాపేట జిల్లా DMHO కోటాచలంపై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలను కట్టడి చేయలేక పోయారని అభియోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ముందు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.
సూర్యాపేటలో వారం రోజుల వ్యవధిలో వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి చెందారని అన్నారు. DMHO స్కానింగ్ సెంటర్ల వద్ద డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో సూర్యాపేట ఇంచార్జిగా రంగారెడ్డి జిల్లా DMHO చంద్రశేఖర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.