తెలంగాణ
HYD Metro: హైదరాబాద్లో మెట్రో రైల్ సేవలకు అంతరాయం.. ప్రయాణికుల ఇబ్బందులు

HYD Metro: హైదరాబాద్లో మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అమీర్పేట్- హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలకు బ్రేక్ పడింది. జూబ్లీహిల్స్ స్టేషన్లో మెట్రో రైలు నిలిచిపోయింది. అయితే తొలుత బేగంపేట్ స్టేషన్లో మెట్రో రైలు దాదాపు 30నిమిషాలు ఆగింది.
ఇక సాంకేతిక కారణాలతోనే మెట్రో రైలు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులతో అన్నీ మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతానికి మెట్రో సైవలు ప్రారంభమైనప్పటికీ.. ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం.