తెలంగాణ
Dharmapuri Arvind: పాకిస్తానీయులను దేశం నుండి పంపించేయాలి

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ రాష్ట్ర సాధనకు ఇందూరు నుంచే పునాది పడుతుందన్నారు. కాంగ్రెస్వి ఓటు బ్యాంకు రాజకీయాలంటూ అర్వింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల ప్రాణాలంటే వారికి లెక్కలేదంటూ నిప్పులు చెరిగారు. ఏనాడైనా ముస్లింలు బీజేపీకి ఓట్లు వేశారా? అంటూ నిలదీశారు.
పాకిస్తానీయులను దేశం నుండి పంపించేయాలన్నారు ధర్మపురి అర్వింద్. బోధన్ రోహింగ్యాలకు అడ్డాగా మారిందంటూ ధ్వజమెత్తారు. 2029 ఎన్నికల్లో ఇందూరు సెగ్మెంట్లో 70శాతం ఓట్లు వస్తాయని అర్విం ద్ ఆశాభావం వ్యక్తం చేశారు.